Header Banner

ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!

  Wed May 21, 2025 08:12        Politics

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మోడల్‌ స్కూల్స్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టర్ టీచర్లకు తీపికబురు చెప్పింది. మొత్తం 282 మంది కాంట్రాక్టు టీచర్ల సేవలను రెన్యువల్‌ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ మేరకు మరో ఏడాది రెన్యువల్ చేసేందుకు అనుమతి ఇస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 282మందిలో 211 మంది పీజీటీలు, 71 మంది ఉండగా.. వీరి టీజీటీల రెన్యువల్‌కు అనుమతిచ్చింది. ఇటు పాఠశాల విద్యాశాఖలోని బోధనేతర సిబ్బంది బదిలీలకు కూడా లైన్ క్లియర్ అయ్యింది. బదిలీలు చేపట్టేందుకు అనుమతి ఇస్తూ ఆ శాఖ డైరెక్టర్‌ వి.విజయరామరాజు ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీలపై నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా బదిలీలు నిర్వహించాలని తెలిపారు.
రాష్ట్రంలో ప్రధానోపాధ్యాయుల అకౌంట్‌ పరీక్ష ఫలితాలను ప్రభుత్వ పరీక్షల విభాగం విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 54 మంది పరీక్షకు హాజరు కాగా.. వారిలో 37 మంది ఉత్తీర్ణత సాధించారని ఆ విభాగం డైరెక్టర్‌ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. మరోవైపు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు నిజాయతీ, తపనతో బోధించాలని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకుడు బి.శ్రీనివాసరావు సూచించారు. విజయవాడలో ఆరు రోజులపాటు నిర్వహించనున్న ‘జ్ఞాన ప్రకాశ్‌’ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్‌ కృష్ణారెడ్డి, సంయుక్త డైరెక్టర్‌ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని.. పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థుల సీట్ల కేటాయింపు ఆర్డర్లను.. ఈ నెల 21 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు సంయుక్త కార్యదర్శి ఎండీ ఉబేదుల్లా తెలిపారు. పాఠశాలల్లో 5, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థులు మాత్రమే ఈనెల 21 నుంచి 30లోపు సంబంధిత పాఠశాలలకు హాజరై ప్రవేశాలు పొందాలని సూచించారు. ఇటు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. మొదటిరోజు తెలుగు పరీక్షకు 35,686 మంది విద్యార్థులకుగాను 22,238 (62.32శాతం) మంది హాజరయ్యారని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ వి.విజయరామరాజు తెలిపారు.

ఇది కూడా చదవండి: ఏపీలో ఆర్టీసీ ప్రయాణికులకు ఇకపై నో టెన్షన్..! విమానాల తరహాలో బస్సుల్లో కూడా..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి! 

 

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి, మేయర్ విజయలక్ష్మి.. సౌకర్యాలపై ఆరా!

 

ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #APGovernment #EmployeeWelfare #FestivalBonus #AndhraPradesh #GovernmentOrders #APNews